ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న మిగతా ఆరుగురి మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది . అయితే ఇది చివరి దశకు చేరుకుందని..ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాల ఆచూకీ లభించే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. నిపుణుల సూచనతో డీ1 ప్రాంతంలో మట్టి తొలగింపు ప్రక్రియలను వేగవంతం చేశారు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే మరిన్ని మృతదేహాలను బయటకు తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో పని చేస్తున్న సమయంలో సిమెంట్ స్లాబ్ కూలడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్ నుంచి ఇప్పటి వరకూ అతి కష్టం మీద రెండు మృతదేహాలను బయటకు తీయగా, మిగతా ఆరు మృతదేహాల కోసం ఇంకా గాలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే 53 రోజులుగా టన్నెల్ లోపల నిరంతయారంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, టిబియం మిషన్ శకలాలను.. కన్వేయర్ బెల్ట్ ద్వారా రెస్క్యూ బృందాలు బయటకు తరలిస్తున్నాయి . అయితే ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్టు రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అలాగే నిపుణుల సూచనలను తీసుకుని.. డీ1 ప్రాంతంలో మట్టిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడంతో.. రెండు, మూడు రోజులలోనే మిగిలిన మృతదేహాలను కూడా బయటకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తొంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో ..ఘటన జరిగిన 16 రోజుల తర్వాత ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్సింగ్ అనే కార్మికుడు డెడ్ బాడీని బయటకు తీయగా.. మార్చి 25న ఇంజనీర్ మనోజ్కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీసాయి. ఈ ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించిన అధికారులు తరువాత వారి కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందించారు.