భారత్ జట్టుకు అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్, పలువురు క్రికెటర్లు ‌

2-1 against Australia, AUS vs IND, Brisbane Test, Highlights India vs Australia Match, IND vs AUS 4th Test highlights, IND vs AUS 4th Test Results, India breaches Australia’s Brisbane fortress, India clinch Australia Test series, India vs Australia, India vs Australia Match, India Wins, India Wins India vs Australia, India Wins Test Series, India Wins Test Series with 2-1 against Australia, indian cricket team, KCR Congratulates Indian Cricket Team, Mango News, PM Modi Congratulates Indian Cricket Team

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్టుల సిరీస్ ను‌ 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. “ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు విజయం సాధించడం మనందరికీ ఏంతో సంతోషాన్ని కలిగించింది. ఆటగాళ్ల ఎనర్జీ, ఆటపట్ల అభిరుచి సిరీస్ అంతటా కనిపించింది. అలాగే వారి ఉద్దేశం, గొప్ప పట్టుదల, గెలవాలనే సంకల్పం కూడా అలాగే ఉంది. భారత్ జట్టుకు అభినందనలు. భవిష్యత్ టోర్నీల్లోనూ కూడా మరిన్ని విజయాలు సాధించాలి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

అలాగే ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. జట్టులో ప్రధాన ఆటగాళ్ళు గాయాల బారినపడినా పరిమిత వనరులతో ఇండియా జట్టు అద్భుతం చేసిందని ప్రశంసించారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని అన్నారు. కెప్టెన్ అజింక్యా రహనే, జట్టు సభ్యులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు మాజీ క్రికెటర్లు భారత్ జట్టు విజయంపట్ల సంతోషం వ్యక్తం చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =