తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు 17 మంది అధికారులను (8- ఐఏఎస్, 9 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూలై 14, మంగళవారం నాడు 2 జీవో లను జారీ చేశారు. ఈ నియామకాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థ) నియమించినట్టు అయింది. అలాగే యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ జి.రమేశ్ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఐఏఎస్ అధికారులు – అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం:
- అనుదీప్ దురుశెట్టి – భద్రాద్రి కొత్తగూడెం
- కోయ శ్రీహర్ష – జోగుళాంబ గద్వాల
- అభిలాష అభినవ్ – మహబూబాబాద్
- బి.సత్యప్రసాద్ – రాజన్న– సిరిసిల్ల
- కుమార్ దీపక్ – పెద్దపల్లి
- ఆదర్శ్ సౌరభి – ములుగు
- భోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు – నిర్మల్
- తేజస్ నంద్లాల్ పవార్ – మహబూబ్నగర్
నాన్ క్యాడర్ ఆఫీసర్స్ (స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు) – అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) నియామకం:
- కోట శ్రీవాత్సవ – వనపర్తి
- జాల్దా అరుణశ్రీ – జగిత్యాల
- అనుగు నర్సింహారెడ్డి – కరీంనగర్
- కందూరి చంద్రారెడ్డి – నారాయణపేట
- ఎన్.నటరాజ్ – కొమరంభీం–ఆసిఫాబాద్
- వై.వీ.గణేష్ – జయశంకర్ భూపాలపల్లి
- బి.వెంకటేశ్వర్లు – మెదక్
- జి.పద్మజారాణి – సూర్యాపేట
- డి.శ్రీనివాస్రెడ్డి – యాదాద్రి భువనగిరి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu