కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్స్ను హైదరాబాద్ నగరంలో బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఒక ముఠాను జూలై 14, మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాదర్ఘాట్ ప్రాంతంలో 35 లక్షల విలువైన యాంటీ వైరల్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
మందులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నందుకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠా కరోనా చికిత్సకు వాడే మందులను రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు. అలాగే వీరి వద్ద నుంచి కరోనా టెస్ట్ చేసే ర్యాపిడ్ కిట్స్, ఇంజక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. బ్రోకర్లు లేదా నకిలీ ఏజెంట్లచే మోసపోయి దోపిడీకి గురికావద్దని ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సందేహం ఉంటే వాట్సాప్లో 9490616555 నెంబర్ కు సమాచారం పంపాలని సూచించారు.
8 arrested including 1 from Delhi for Blackmarketing medicines used for Corona treatment. Seizure worth 35 lakhs in Chaderghat area. Please don’t get lured and cheated by brokers or fake agents . Any doubt send information on whatsapp at 9490616555 or contact local patrol car.
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) July 14, 2020
BUSTED INTERSTATE BLACK MARKETING GANG FOR SELLING EMERGENCY DRUGS USING FOR COVID-19 PATIENTS-SEIZED DRUGS, NET CASH RS,55,000/- AND (08) CELL PHONES TOTAL WORTH RS. 35.5 Lakhs. pic.twitter.com/azpbvAUpWh
— Hyderabad City Police (@hydcitypolice) July 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu