డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలి – పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం

CM YS Jagan Orders To Allocate Postings For DSC 1998 Candidates During Review Meet on School Education Department,Postings Of Dsc 98 Candidates,Cm Jagans Order,Review Of School Education Department,Mango News,Mango News Telugu,Dsc Notification 2022 In Ap,Apdsc Apcfss In 2022,Ap Dsc Marks Memo,Ap Dsc Final Selection List,Dsc Notification 2022 Ap District Wise,Ap Dsc Merit List District Wise,Dsc Notification In Ap,Ap Dsc 2022 Syllabus,Andhra Pradesh Dsc Notification 2021,Dsc Notification 2022 Andhra Pradesh,Dsc Jobs In Andhra Pradesh,Andhra Pradesh Dsc Previous Papers,Dsc Notification 2008 Andhra Pradesh,Age Limit For Dsc In Andhra Pradesh,District Selection Committee Andhra Pradesh,Dsc Notification Andhra Pradesh,Dsc Previous Papers Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ 1998 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు కేటాయించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈమేరకు ఆయన గురువారం పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సహా పలువురు విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు, ఆదేశాలు..

  • డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఖాళీలను బట్టి త్వరగా పోస్టింగ్స్ కేటాయించాలి.
  • రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌ల నిర్వహణపై దృష్టి పెట్టాలి.
  • డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలి.
  • అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తగిన చర్యలు తీసుకోవాలి.
  • తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలి.
  • ఈ డిజిటల్ స్క్రీన్‌లతో విద్యార్థులు అత్యుత్తమ విద్యనభ్యసించే విధంగా తీర్చిదిద్దాలి.
  • వీటిని ఉపయోగించి ఎలా బోధించాలనే దానిపై ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇవ్వాలి.
  • వచ్చే విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుకకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి.
  • అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలకు సార్టెక్స్ పోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలి.
  • వీటితోపాటు అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని సరఫరా చేయాలి.
  • ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఇస్తున్న ఆహారంతో పాటు బడి పిల్లలకు బెల్లం, కాపర్ మాల్ట్ ఇవ్వాలి.
  • అలాగే ఐరన్ మరియు కాల్షియం లోప నివారణకు ఫిబ్రవరి 1 నుంచి వారానికి మూడు రోజులు పిల్లలకు ఒక గ్లాసు రాగి మాల్ట్ అందించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE