తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు(జనవరి 6, శుక్రవారం) హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండగా, ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొననున్నారు. ముందుగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ బయలుదేరి హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించడంతో పాటుగా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రీన్ వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం హుజూర్ నగర్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ కు చేరుకుంటారు. అక్కడ మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆతర్వాత గట్టుప్పల్ మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు పర్యటనను ముగించుకుని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE