యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1363 మంది వచ్చారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. యూకే నుంచి వచ్చిన మొత్తం 1363 మందిలో, ఇప్పటికి 1346 మందిని గుర్తించినట్లుగా వెల్లడించారు. మరో 17 మంది వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికి గుర్తించిన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, అలాగే వారి కాంటాక్ట్స్ లో మరో 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. వీరికి సంబంధించిన జీనోమ్-సీక్వెన్సింగ్ పై పూణేలోని వైరాలజీ ల్యాబ్, సీసీఎంబీ నుంచి ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉందని, రాష్ట్రంలో కొత్తరకం కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడలేదని చెప్పారు. యూకే నుంచి వచ్చినవారిలో గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు. పాజిటివ్ గా తేలిన వారందరిని కోవిడ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ