జాతీయ విద్యా విధానం (NEP) కింద త్రిభాషా సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంపై తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. హిందీని ముసుగుగా, సంస్కృతాన్ని దాచిన ముఖంగా అభివర్ణిస్తూ, తమిళ ప్రజలపై భాషా నియంత్రణను అనుమతించమని స్పష్టం చేశారు.
భాషా విధానంలో కేంద్రం చూపుతున్న ఏకపక్ష ధోరణి ప్రాంతీయ భాషలకు ముప్పుగా మారుతోందని స్టాలిన్ అన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో మైథిలి, అవధి, బ్రజ్ వంటి భాషలు హిందీ ఆధిపత్యం కారణంగా కనుమరుగవుతున్నాయన్నారు. భోజ్పురి, ఛత్తీస్గఢి, మార్వారీ వంటి భాషలు కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయన్నారు.
ఇదే వివాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. భాషా వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎంపీగా నిలబడతారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత ఇచ్చే విధానం అనుసరించాలని డిమాండ్ చేస్తోంది. హిందీని రుద్దే కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ, తమ భాషా సంస్కృతిని పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని తమిళ ప్రభుత్వం ప్రకటించింది.
Poor governance will never be hidden by such shallow attempts to divide society.
It will be interesting to know what the Leader of the Opposition, @RahulGandhi Ji, has to say on this subject. Does he, as MP of a Hindi-speaking seat, agree? https://t.co/Oj2tQseTno
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 27, 2025