ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 98 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 43 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 98 కేసులతో కలిపి జూన్ 4, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9986 సాంపిల్స్ ని పరీక్షించగా 98 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా వలన కృష్ణా, గుంటూరు, కర్నూల్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మరణించగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 71 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో 2273 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1033 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 616 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 372 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 119 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఈ 735 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4112 కి చేరింది.
#COVIDUpdates: as on 04/06/2020
Total positive cases: 3377
Discharged: 2273
Deceased: 71
Active cases: 1033#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Oi0iova1G8— ArogyaAndhra (@ArogyaAndhra) June 4, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu