ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4, గురువారం నాడు రెండో విడత “వైఎస్ఆర్ వాహన మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలో సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులు ఈ పథకానికి ఎంపిక కాగా, మొత్తం 2,62,493 మంది లబ్దిదారుల ఖాతాల్లో ఈ రోజు రూ.10వేలు జమకానున్నాయి.
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఈసారి నాలుగు నెలల ముందుగానే లబ్దిదారులకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది. రెండో విడత వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాక ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ లో పలువురు రాష్ట్ర మంత్రులు, రవాణాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu