ఏపీలో కొత్తగా 11766 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 45,581 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కర్నూల్, శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, అనంతపూర్ వంటి ఐదు జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,09,228 కు చేరుకుంది.

ఇక కరోనా వలన నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరంలో జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7579 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 4441 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 9,27,418 కు చేరింది. అలాగే ప్రస్తుతం 74231 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,58,80,750 కరోనా పరీక్షలను నిర్వహించారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(11766):

  1. చిత్తూరు – 1885
  2. గుంటూరు – 1593
  3. అనంతపూర్ – 1201
  4. కర్నూల్ – 1180
  5. శ్రీకాకుళం – 1052
  6. నెల్లూరు – 949
  7. విశాఖపట్నం – 910
  8. కృష్ణా – 831
  9. తూర్పుగోదావరి – 796
  10. విజయనగరం – 448
  11. ప్రకాశం – 370
  12. కడప – 361
  13. పశ్చిమగోదావరి – 190
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ