దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలో ఉన్న దేశంలోని దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు మే మరియు జూన్ నెలల్లో నెలకు 5 కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో అందించిన విధంగానే ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎం-జికెఎవై) కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నారు. పేదలకు 5 కేజీల బియ్యం/గోధుమలు పంపిణీ కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయంలో భాగంగా కేంద్రం రూ.26 వేల కోట్లు ఖర్చు చేయనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఆసరాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ