ఏపీలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 3963 కరోనా కేసులు, 52 మంది మృతి

AP Corona Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత ఐదు రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3963 కేసులతో కలిపి జూలై 18, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 44609 కు చేరింది. గత 24 గంటల్లో 23,872 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన రాష్ట్రంలో మరో 52 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో పన్నెండు మంది, గుంటూరులో ఎనిమిది మంది, కృష్ణాలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 586 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 18, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 44609
  • కొత్తగా నమోదైన కేసులు : 3963
  • నమోదైన మరణాలు : 52
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 21763
  • యాక్టీవ్ కేసులు : 22260
  • మొత్తం మరణాల సంఖ్య : 586

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu