ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,732 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 14, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049 కు చేరుకుంది. ఇక కరోనా వలన నెల్లూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపూర్, కర్నూల్ మరియు ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7339 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1606 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 9,01,327 కు చేరింది. అలాగే ప్రస్తుతం 28383 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,55,34,460 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(4157):
- తూర్పుగోదావరి – 617
- కర్నూల్ – 386
- కృష్ణా – 135
- కడప – 112
- గుంటూరు – 434
- చిత్తూరు – 517
- అనంతపూర్ – 297
- నెల్లూరు – 276
- ప్రకాశం – 230
- శ్రీకాకుళం – 522
- విశాఖపట్నం – 417
- విజయనగరం – 154
- పశ్చిమగోదావరి – 60
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ