ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఎం.వెంకటేశ్వర రావు జనసేన పార్టీలో చేరారు. గురువారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఎంవీ రావు జనసేనలో చేరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఎంవీ రావు సుదీర్ఘ కాలం ఆర్టీసీలో అధికారిగా పని చేశారు. జనసేనలో చేరిన సందర్భంగా ఎంవీ రావు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజాపక్షంగా ఉన్నాయన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేస్తానని, పార్టీ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తానని ఎంవీ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ