ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7073 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7073 కేసులతో కలిపి సెప్టెంబర్ 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,61,458 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 69,429 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5606 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 5,88,169 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 8695 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 67683 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu