ఏపీలో కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 8601 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 3368 కి పెరిగింది. మరో 8741 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 54463 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.

కరోనా వలన నెల్లూరులో పది మంది, ప్రకాశంలో పది మంది, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3368 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 24, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 32,92,501
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 3,61,712
  • కొత్తగా నమోదైనా కేసులు : 8601
  • నమోదైన మరణాలు : 86
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 2,68,828
  • యాక్టీవ్ కేసులు : 89516
  • మొత్తం మరణాల సంఖ్య : 3368

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu