మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహాద్ నగరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో మహాద్ నగరంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 25 మందిని శిధిలాల నుంచి బయటకు తీసి రక్షించారు. కాగా ఇంకా 50 మందికి పైగా శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం నివేదించలేదు. ‘తారిక్ గార్డెన్’ భవనం కూలిపోయిందని స్థానికులు అందించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu