1 నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటన, టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం

Andhra Pradesh, Andhra Pradesh Announces Holidays for 1 to 9 Classes, Andhra Pradesh Class X and Intermediate examinations, Andhra Pradesh to conduct 10 and Intermediate exams, AP Announces Holidays for 1 to 9 Classes, AP Govt Announces Holidays for 1 to 9 Classes, AP Govt Announces Holidays for 1 to 9 Classes from Tomorrow, AP Schools, AP SSC, Class X, Coronavirus Live Updates, Inter Exams 2021, Inter Exams will be Held as per Schedule, Mango News

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20, మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కాగా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని, వారికీ ఈ విద్యా సంవత్సరం పూర్తయినట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ