దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత ఐదు రోజులుగా 2 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కేసులు, 1619 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,78,769 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే 78.58 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 19,29,329 (12.81%) కు చేరుకుంది. మరో 1,44,178 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 86.00 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 18 8am–ఏప్రిల్ 19 8am) :
- మహారాష్ట్ర – 68631
- ఉత్తరప్రదేశ్ – 30566
- ఢిల్లీ – 25462
- కర్ణాటక – 19067
- కేరళ – 18257
- ఛత్తీస్ ఘడ్ – 12345
- మధ్యప్రదేశ్ – 12248
- తమిళనాడు – 10723
- గుజరాత్ – 10340
- రాజస్థాన్ – 10262
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 503
- ఛత్తీస్ ఘడ్ – 170
- ఢిల్లీ – 161
- ఉత్తర్ ప్రదేశ్ – 127
- గుజరాత్ – 110
- కర్ణాటక – 81
- పంజాబ్ – 68
- మధ్యప్రదేశ్ – 66
- జార్ఖండ్ – 50
- తమిళనాడు – 42
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ