హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా పాస్, పది పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Andhra Pradesh, Andhra Pradesh SSC exams cancelled, AP 10th exams, AP Cancelation of Tenth Class Exams, AP Latest News, AP News, AP SSC Exams, AP Tenth Class Exams, Official Orders over Cancelation of AP Tenth Class Exams

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల రద్దుకు సంబంధించి జూలై 14, మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చ్-2020 పదో తరగతి పరీక్షలకు నమోదు చేసుకుని హాల్ టికెట్స్ పొందిన విద్యార్థులంతా ఉత్తీర్ణులు అయినట్టుగా పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్టుగా తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu