ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసారు. 1980 నుండి బిశ్వ భూషణ్ బిజెపి క్రీయాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు, ఈయన ప్రముఖ న్యాయవాది. సంఘ్ పరివార్ తో అనేక సంవత్సరాలుగా సత్సంబంధాలు కలిగివున్నారు మరియు రచయితగా అనేక పుస్తకాలు రాసారు. 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర విభజన తర్వాత కూడా, ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవరించారు. మరోవైపు ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి కూడ కొత్త గవర్నర్ గా సుశ్రి అనసూయను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
[subscribe]
[youtube_video videoid=rd_Oz3yQiWo]