ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పాటు పొడిగించబడింది. సెప్టెంబర్ 30, 2021 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. ముందుగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ జూన్ 30తో పదవీ విరమణ చేయాల్సిన ఉండగా, సీఎస్ పదవి కాలం పొడిగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటుగా పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ