గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతిగృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం… గిరిజన ఉత్పతుల మార్కెటింగ్కు సంబంధించి ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏ లాంటి సంస్థలను యాక్టివేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 2014 మరియు 2019 మధ్య అమలులో ఉన్న బహుళ సంక్షేమ పథకాలు బలహీనపడటం పట్ల ముఖ్యమంత్రి నిరాశను వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులను ఆదుకునేందుకు రూపొందించిన ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమం, అంబేద్కర్ విదేశీ విద్యా నిధి, ఉత్తమ అందుబాటులో ఉన్న పాఠశాలల కార్యక్రమం వంటి విలువైన కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడాన్ని ఆయన ప్రత్యేకంగా ఎత్తిచూపారు. గత టీడీపీ హయాంలో గిరిజనులకు అందించిన పథకాలను మళ్ళీ మొదలుపెట్టాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వ విధానాల వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా దిగజారిపోయాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాలకు ఆరోగ్య సేవలు అందేలా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి అధికారులతో చర్చించారు. అందులో భాగంగా ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదని అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. గిరిజన ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో డోలీని మోసే పరిస్థితి కల్పించకూడదని చెప్పారు. గిరిజన మహిళల జీవన స్థితిగతులు మరియు సౌకర్యాలను పెంపొందించడానికి ప్రసూతి వసతి గృహాలు, ట్రైకార్లు, ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్లు, మరియు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను యాక్టివేట్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF