ఏపీలో 7.5 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ, 10 వేలు దాటిన పాజిటివ్ కేసులు

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రతి మిలియన్ జనాభాకు సగటున 14,049 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 36047 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కొత్తగా 497 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 24, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10331 కు చేరింది.

497 కేసుల్లో 448 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 37, విదేశాల నుంచి వచ్చిన వారు 12 మంది ఉన్నారు. 10331 కేసుల్లో 8306 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2025 మంది ఉన్నారు. మరోవైపు కర్నూల్ లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 129 కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇప్పటికి 4779 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 5423 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu