ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- దేశంలోని అన్ని సహకార బ్యాంకులు ఇకపై ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఈ ఆర్డినెన్సు కు కేబినెట్ ఆమోదం.
- ప్రధాన మంత్రి ముద్రయోజనలో శిశు విభాగం కింద రుణాలు తీసుకున్నవారికి వడ్డీలో రెండు శాతం రాయితీ. అర్హతకల్గిన లబ్దిదారులకు 12 నెలల పాటు రాయితీ లభించనుంది.
- ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు.
- ఓబీసీ ఉపవర్గీకరణ కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగింపు.
- అంతరిక్ష రంగంలో సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి.
- పశుసంవర్ధక మౌలిక సదుపాయాల ప్రత్యేక నిధికి కేబినెట్ ఆమోదం, అర్హత కల్గిన లబ్దిదారులకు వడ్డీలో మూడు శాతం రాయితీ.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu