విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపినట్టు తెలిపారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్టు గంటా తెలిపారు.
మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై విశాఖలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఆందోళన మొదలైంది. కేంద్రం వెంటనే ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో కార్మికులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమవుతామని ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ