ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 30,863 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 183 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా గుంటూరులో 30, కృష్ణాలో 27, చిత్తూరులో 25, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,014 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14431 కు చేరింది. గత 24 గంటల్లో 163 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,55,389 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,194 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ