ఏపీలో 20 వేలు దాటినా కరోనా కేసులు, 239 కి చేరిన మరణాలు

Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, Covid-19 in AP, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 6, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20019 కి చేరింది. వీటిలో 1263 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 56, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. గత 24 గంటల్లో 16,712 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మొత్తం కేసుల్లో 17365 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2654 మంది ఉన్నారు.

మరోవైపు కరోనా వలన శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 239 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 8920 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8606 మంది ఆసుపత్రుల్లో, 2254 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 10860 మంది చికిత్స పొందుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu