పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుసంధానం కోసం చివరితేదిని జూన్ 30, 2020 గా ప్రకటించారు. అయితే దేశంలో కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా మార్చి 31, 2021 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ లోనే పాన్-ఆధార్ అనుసంధానం కచ్చితంగా చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాన్ కార్డు కలిగిన ప్రతి వారికీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేశారు. ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ కూడా ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu