ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, జూలై 13 సాయంత్రం 5 గంటల లోపు పంపాలని వివిధ శాఖల అధికారులను సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత కేబినెట్ సమావేశం జూన్ 11 న జరగగా ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం, టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు, ఫీజు రియింబర్స్మెంట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu