రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా, కెనడా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థల ముఖ్య ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. బుధవారం రోజున సిలికాన్ వ్యాలీలో జరిగిన బే-ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న లోకేశ్, రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక లక్ష్యాలను వివరించారు.
ఈ క్రమంలో విశాఖపట్నంలో భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్కు సంబంధించిన ముఖ్య ప్రకటనను మంత్రి లోకేశ్ చేశారు. ఇక గూగుల్ పెట్టుబడి అనేది ఏపీని ఏఐ (Artificial Intelligence) రంగంలో అగ్రపథాన నిలపడానికి జరుగుతున్న కృషిలో ప్రారంభం మాత్రమే అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో సహా ఇంటెల్, ఎన్విడియా, అడోబ్, జూమ్, ఫెయిర్ఫాక్స్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
#GoogleChoosesAP
It was a pleasure to meet Sundar Pichai, CEO @Google, along with Thomas Kurian & Bikash Koley in San Francisco. I thanked Google for their landmark $15B investment in the Visakhapatnam AI Data Center – set to be one of the largest FDI projects outside the US. We… pic.twitter.com/55wgy7mBDM— Lokesh Nara (@naralokesh) December 10, 2025
1. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో భేటీ
శాన్ ఫ్రాన్సిస్కోలో సుందర్ పిచాయ్తో సుమారు 2 గంటలపాటు జరిగిన సమావేశంలో లోకేశ్ కీలక ప్రతిపాదనలు చేశారు.
-
విశాఖ డేటా సెంటర్: విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఏఐ డేటాసెంటర్ ప్రాజెక్టు పనులపై చర్చించారు. దీనికి మార్చిలో శంకుస్థాపన జరుగుతుందని లోకేశ్ తెలిపారు.
-
డ్రోన్ సిటీ ప్రతిపాదన: ఆంధ్రప్రదేశ్లో రాబోయే ‘డ్రోన్ సిటీ’ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, కాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
-
సర్వర్ తయారీ: డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకో సిస్టమ్ను ప్రోత్సహించాలని కోరారు.
-
పిచాయ్ స్పందన: క్లౌడ్ రీజియన్ల విస్తరణ, ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్’ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు పిచాయ్ తెలిపారు. ఏపీ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2. ఇంటెల్, ఎన్విడియాలకు కీలక విజ్ఞప్తులు
-
ఇంటెల్ (Intel): ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో భేటీలో, ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని లోకేశ్ కోరారు. అలాగే, ‘ఇంటెల్-అమరావతి ఏఐ రిసెర్చ్ సెంటర్’ను శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని కోరారు.
-
ఎన్విడియా (NVIDIA): వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్పూరితో భేటీలో.. ఏపీలో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని, డీప్టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
#InvestInAP#ChooseSpeedChooseAP
Delighted to meet with Raj Mirpuri, VP – Enterprise & Cloud Sales at NVIDIA, in Santa Clara. I invited NVIDIA to partner with Andhra Pradesh on AI skill development, smart manufacturing, and future technologies. I proposed a Smart Factory Pilot… pic.twitter.com/aHUAhaCYl4— Lokesh Nara (@naralokesh) December 10, 2025
3. అడోబ్, జూమ్ సంస్థలతో చర్చలు
-
అడోబ్ (Adobe): సీఈవో శంతను నారాయణన్తో జరిగిన భేటీలో, విశాఖలో అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని కోరారు. శంతను డైరెక్టర్గా ఉన్న ఫైజర్ సంస్థ ఏపీలోని ఔషధ పరిశ్రమ జోన్లలో వ్యాక్సిన్లు, బయోలాజిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
-
జూమ్ (Zoom): ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ వెల్చా మి శంకరలింగంతో లోకేశ్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ క్లాస్రూమ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
#InvestInAP#ChooseSpeedChooseAP
It was great meeting up again with Shantanu Narayen, CEO @Adobe, in San Francisco. I invited Adobe to set up a Global Capability / Development Center in Visakhapatnam – strengthening AP’s position in digital innovation. I also discussed deeper… pic.twitter.com/f07tDNMVmz— Lokesh Nara (@naralokesh) December 10, 2025
మొత్తంగా, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించడంతో పాటు టెక్నాలజీ, పరిశోధన రంగాలలో ఏపీని ప్రగతి పథంలో నడిపించాలనే లోకేశ్ ప్రతిపాదనలకు టెక్ దిగ్గజాల నుంచి సానుకూల స్పందన లభించింది.





































