ఆంధ్రాని వరుణుడు వదలట్లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోనేలేదు. అంతలోనే మరో తుఫాన్ ముప్పు ఆంధ్రాని వణికిస్తోంది. అండమాన్ సముద్రంలో మొదలైన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. రేపటికి అది తుఫాన్ గా మారే అవకాశం ఉందని, ఎల్లుండి తీరం దాటవచ్చని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా ఒడిస్సా వైపుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఒడిశాలో కొన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ