చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఒకటి ముందుగానే ఏకగ్రీవం కాగా 24 స్థానాల్లో నవంబర్ 15న పోలింగ్ జరిగింది. 24 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బుధవారం జరగగా, 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవమైన వార్డుతో కలిపి వైఎస్సార్సీపీ మొత్తం 19 వార్డులు దక్కించుకుంది. టీడీపీ కేవలం 6 వార్డులే గెలుచుకోగలిగింది. ఈ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించడంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకుంది. కుప్పంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ