ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 23, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,136 సాంపిల్స్ ని పరీక్షించగా 47 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56 కి చేరింది. మరోవైపు 1778 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 47 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 727 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 21, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1761 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 42 మందికి, వలస వచ్చిన వారిలో 19 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసుతో కలిపి మొత్తం 62 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ వైరస్ వలన ఇవాళ ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 48 కి చేరింది. అలాగే కొత్తగా 7 మందితో కలిపి ఈ వైరస్ నుంచి కోలుకుని 1043 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 670 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates:
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసు లకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.#APFightsCorona— ArogyaAndhra (@ArogyaAndhra) May 23, 2020
Media bulletin
Date: May 22, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/BSrwnkV2Pg
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]