ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కు చేరుకుంది. గత 24 గంటల్లో 35804 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 106 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 11, కర్నూల్ లో 3, కృష్ణాలో 9, కడపలో 5, గుంటూరులో 7, చిత్తూరులో 33, అనంతపూర్ లో 10, నెల్లూరులో 3, ప్రకాశంలో 0, శ్రీకాకుళంలో 9, విశాఖపట్నంలో 8, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 8 కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7169 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 57 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,82,137 కు చేరింది. అలాగే ప్రస్తుతం 774 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మార్చి 2 నాటికీ ఏపీలో మొత్తం 1,40,10,204 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ