మే 26 వ తేదీ వరకు తమ రాష్ట్రానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను పంపవద్దని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రైల్వే శాఖను కోరింది. అంఫాన్ పెను తుఫాన్ దృష్ట్యా శ్రామిక్ రైళ్లను రాష్ట్రానికి పంపవద్దని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రెటరీ రాజీవ్ సిన్హా రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అంఫాన్ తుఫాన్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపిందని, భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా జిల్లాలలో సహాయ, పునరావాస చర్యల్లో పాల్గోంటునందువలన కొద్ది రోజులు పాటుగా ప్రత్యేక రైళ్లలో వచ్చిన వారిని రాష్ట్రంలోకి తీసుకోని జాగ్రత్తలు పాటించడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. అందువలన మే 26 వ తేదీ వరకు శ్రామిక్ రైళ్లను రాష్ట్రానికి పంపొద్దని కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu