ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1540 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 27, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,57,932 కు, మరణాల సంఖ్య 13292 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2304 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,23,675 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,965 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1540):
- చిత్తూరు – 280
- కృష్ణా – 263
- నెల్లూరు – 210
- ప్రకాశం – 176
- పశ్చిమగోదావరి – 168
- గుంటూరు – 152
- విశాఖపట్నం – 112
- శ్రీకాకుళం – 59
- అనంతపూర్ – 49
- కడప – 33
- కర్నూల్ – 21
- విజయనగరం – 14
- తూర్పుగోదావరి – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ