మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. జనవరి 2, శనివారం నాడు 3218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,38,854 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 49,631 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 2,110 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,34,935 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.64 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.56 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 53,137 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి రాష్ట్రంలో 1,28,90,441 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ