పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ప్రధానితో సీఎం మమతా బెనర్జీ భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. ఈ భేటీ సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది.
భేటీ అనంతరం సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా, ఔషధాల సరఫరా మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదన గురించి చర్చించినట్టు తెలిపారు. అలాగే పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బుధవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా మమతా బెనర్జీ భేటీ కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ