చంద్రయాన్-4 మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, గగన్యాన్, ఎన్జీఎల్ఏ వాహకనౌక ప్రాజెక్టులకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నాలుగు అంశాపై ఇస్రో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో కేంద్ర కేబినెట్ చంద్రయాన్-4 మిషన్కు ఆమోదం తెలిపిందని ఇస్రో అధికారులు చెప్పారు.
ఈ ప్రాజెక్టుల సాయంతో చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2026 నాటికి చేపట్టాలని ఇస్రో భావిస్తుంది. అయితే చంద్రయాన్ -4ను..ఒకదశలో కాకుండా రెండు దశల్లో చంద్రయాన్-4 మిషన్ను నిర్వహిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ -4 ప్రాజెక్టు కోసం ల్యాండర్ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్ను మాత్రం జపాన్లో సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మిషన్లో భాగంగా చంద్రుడిపై గల మట్టి నమూనాలను సేకరించి.. చంద్రయాన్ -4 తిరిగి భూమిపైకి చేరుకుంటుందని వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కనుక అనుకున్నట్లు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్ను రూపొందించిన దేశంగా భారత్ చరిత్రను లిఖించనుందని ఇస్రో భావిస్తోంది.