యూపీలో ఇకపై విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సీఎం యోగి కీలక నిర్ణయం

CM Yogi Adityanath Mandates Singing of Vande Mataram in All Educational Institutions in UP

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇకపై జాతీయ గీతం ‘వందే మాతరం’ ఆలపించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రతి విద్యాసంస్థలో రోజువారీ సభల్లో లేదా ప్రత్యేక కార్యక్రమాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని, దీనిపై సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేయాలని ఈ మేరకు నేడు ఆదేశాలు జారీ చేశారు.

గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ‘ఏక్తా యాత్ర’ కార్యక్రమంలో భాగంగా సామూహిక వందేమాతరం గేయాలాపన సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

నిర్ణయం, కారణాలు: విద్యాసంస్థల్లో చిన్న వయసులోనే జాతీయ గీతాన్ని పాడించడం వల్ల విద్యార్థుల్లో దేశాభిమానం, గౌరవభావం సహజంగానే పెరుగుతాయని సీఎం యోగి అభిప్రాయపడ్డారు.

ఐక్యత, సమగ్రత: ఈ నిర్ణయం దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో భాగంగా తీసుకున్నదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.

జాతీయ గీతం వందేమాతరం పట్ల గౌరవ భావం ఉండాలి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి పాఠశాల, విద్యాసంస్థలో దానిని పాడటాన్ని తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

జాతీయ గీతాన్ని వ్యతిరేకించే వారిపై కూడా సీఎం యోగి తీవ్రంగా మండిపడ్డారు. దేశ సమగ్రతకు సవాల్ విసిరే ప్రయత్నాలను ప్రారంభించడానికి ముందే అణచివేయాలని ఆయన ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here