దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్

Corona Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination in India, Corona Vaccination Programme, Corona Vaccination Updates, Coronavirus Vaccinations, Covid Vaccination Drive India, Covid Vaccination Drive News, Covid Vaccination Drive Updates, COVID-19 Vaccination in India, India Vaccination, Mango News

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 10,205 సెషన్స్ లో 5,72,060 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో జనవరి 29, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల (29,28,053) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 52,878 సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో (2,94,959), కర్ణాటకలో(2,86,089), రాజస్థాన్ లో (2,57,833), మహారాష్ట్రలో (2,20,587), ఒడిశాలో (1,94,058), వెస్ట్ బెంగాల్ లో (1,87,485), ఆంధ్రప్రదేశ్ లో (1,71,683), రాజస్థాన్ లో (1,61,332), తెలంగాణలో (1,51,246) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ