దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,855 కరోనా కేసులు, 163 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048 కు, మరణాల సంఖ్య 1,54,010 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,71,686 (1.60%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 20,746 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,03,94,352 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.96 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.
ఇక జనవరి 28 నాటికీ దేశవ్యాప్తంగా 19,50,81,079 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,42,306 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో అత్యధికంగా ఛత్తీస్ గడ్ లో 6451, కేరళలో 5771, మహారాష్ట్రలో 2889, కర్ణాటకలో 550, తమిళనాడులో 503 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ