దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,946 కరోనా కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,12,093 కు, మరణాల సంఖ్య 1,51,727 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 2,13,603 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 17,652 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,01,46,763 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.52 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.
ఇక జనవరి 13 నాటికీ దేశవ్యాప్తంగా 18,42,32,305 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,43,191 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కేరళలో 6004, మహారాష్ట్రలో 3556, కర్ణాటకలో 746, వెస్ట్ బెంగాల్ లో 723, తమిళనాడులో 673, ఛత్తీస్ గడ్ లో 671, గుజరాత్ లో 583 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ