15 న గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్

AP CM YS Jagan, CM takes part in Kamadhenu Utsavam, CM YS Jagan, CM YS Jagan will Participate in the Cow Worship Programme, Cow worship at Kanakdurga temple, Cow worship performed, Cow worship performed at Andhra, Cow Worship Programme, Cow Worship Programme In AP, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పర్యటించనున్నారు. నరసరావు పేట మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11.50 గంటలకు గోపూజ మహోత్సవం జరిగే ప్రాంగణానికి చేరుకొని, మధ్యాహ్నం 12:30 గంటల వరకు సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గోపూజ జరిగే మున్సిపల్ స్టేడియంను ఇప్పటికే పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =