కేరళలో కొత్తగా 7540 కరోనా కేసులు, 48 మరణాలు నమోదు

Kerala Covid-19 Updates: 7540 New Positive Cases and 48 Deaths in Last 24 Hours

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 76,380 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 7,540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 9.87 శాతంగా నమోదైంది.

అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,34,858 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 48 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,621 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 7,841 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 49,22,834 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 70,459 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ