ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 70,727 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,843 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 301, పశ్చిమగోదావరిలో 235, ప్రకాశంలో 232, తూర్పుగోదావరి జిల్లాలో 222, నెల్లూరులో 203 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,48,592 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 12 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రకాశంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, కృష్ణాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13209 కి పెరిగింది. గత 24 గంటల్లో 2,199 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,11,812 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,571 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ