మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27, మంగళవారం కూడా 66358 కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,10,085 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 66,179 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 67,752 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 36,69,548 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 83.21 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,72,434 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 2,62,54,737 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ


































