ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కోవిడ్-19 వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలందరికి వ్యాక్సినేషన్ చేపట్టటానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయడంలో ప్రాధాన్యతనివ్వాలని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లాను కోరారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక వ్యాక్సిన్ లు ఇవ్వటానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మరియు భారత్ బయోటెక్ డైరెక్టర్ డా.సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ